
సాగునీటిని అడ్డగిస్తే చట్టరీతా చర్యలు
బలిజిపేట : మండలంలోని పెదంకలాం ప్రధాన కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీటిని అందించేందుకు జలవనరులశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు వారబందీ పద్ధతిని అమలు చేశారు. బుధవారం ఈ శాఖల సమన్వయంతో మూడు రోజులపాటు ఆయకట్టు చివరి భూములకు, మరో నాలుగు రోజులపాటు ఎగువనున్న రైతులకు సాగునీరందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విధానాన్ని పెదంకలాం ప్రధాన కాలువ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు పాటించి సాగునీటి ఇబ్బందులకు గురవుతున్న ఆయకట్టు చివరి భూముల రైతులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. లేదంటే నీటిపారుదల వినియోగం, ఆయకట్టు అభివృద్ధి శాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారుల బృందం రైతులకు హెచ్చరిక జారీ చేసింది. బలిజిపేట: మండలంలోని నారాయణపురం గ్రామంలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఖరీదైన నూలు వస్త్రాల తయారీపై మణిపాల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు (రీసెర్చ్ స్కాలర్) జైనా, అమెరికాకు చెందిన వైద్యులు డా.గంట వెంకటేశ్వరరావు, డా.లలితలు పరిశీలించారు. ఆ గ్రామంలోని చేనేత కార్మికులు మగ్గాలపై నేస్తున్న చీరలను, నూలును, చీర తయారీకి వినియోగిస్తున్న పరికరాలను పరిశీలించారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కుటుంబాలను ఆదుకొని రాయితీ రుణాలు అందజేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రీసెర్చ్ స్కాలర్ జైనా న్యూస్టుడే కు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు