© 2026 nimisham.in

భారతదేశం సాధించిన 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటుపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు, మాజీ ఉన్నతాధికారు
లను లక్ష్యం చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గణాంకాల వాస్తవికతను ప్రశ్నించేవారికి సరైన ఉపాధి లేదని, అందుకే వారు టీవీ చర్చా వేదికలపై కూర్చుని కల్పిత వాదనలను తెరపైకి తెస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇటీవల 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఈ గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వంటి ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేశారు. వృద్ధి రేటుకు అనుగుణంగా ఉద్యోగ కల్పన, పెట్టుబడులు ఎందుకు పెరగడం లేదని రాజన్ ప్రశ్నించగా, ప్రభుత్వం పాత జీడీపీ అంచనాలను సవరించి తగ్గించడం వల్లే ప్రస్తుత వృద్ధి రేటు అధికంగా కనిపిస్తోందని గార్గ్ విశ్లేషించారు.ఈ విమర్శలపై ఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పీయూష్ గోయల్ స్పందించారు. విమర్శకులు పాత గణాంకాల సిరీస్ను ప్రస్తుత డేటాతో పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "యాపిల్స్ను యాపిల్స్తోనే పోల్చాలన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి లోపించింది" అని ఆయన చురకలంటించారు. తమ పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయిన వారే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారంటూ పరోక్షంగా కొందరు మాజీ అధికారులపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం గణాంకాలను సృష్టించదని, వాస్తవాలను ఎప్పటికీ